Devatha Serial: సత్య కు పిల్లలు పుట్టారని ఆదిత్య నిన్న తేల్చి చెప్పేస్తాడు.. అది విన్న సూరి రుక్మిణి చనిపోకముందు గర్భవతి అయిందని కదా.. అంటే ఆదిత్య కావాలని నిజం దాస్తున్నాడని తెలుసుకుంటాడు.. నేడు ఈ సీరియల్ ను ఏ కోణంలో మలుపు తిప్పుతారో చూద్దాం..!!
సూరి ధైర్యం చేసి ఆదిత్యను నిజం చెప్పమని అడుగుతాడు. పిల్లలు పుట్టంది నీకా..!? లేక సత్య లో లోపం ఉందా అని అడుగుతాడు.. ఆదిత్య నాకే లోపం అని వాదించడంతో.. రుక్మిణి గర్భవతి అయినప్పుడు లేని లోపం ఇప్పుడు ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తాడు..!? రుక్మిణి గర్భవతా..!? ఈ విషయం మాకు ఎన్నాళ్లు ఎందుకు చెప్పలేదు.. అని ఆదిత్య అడగగా వాళ్ళ బాబాయి జరిగిన విషయాన్ని చెబుతాడు.. రుక్మిణీ తన దగ్గర మాట తీసుకుంటుందని.. తర్వాత ఎన్ని సార్లు చెబుదామనుకున్నా అన్నయ్య వదినలకు అసలు వారసులు లేరన్న విషయాన్ని చెప్పలేక పోయాను అంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఆదిత్య పరుగుపరుగున దేవి ని చూడడానికి వెళ్తాడు. దేవి ఇంటి దగ్గర లేకపోవడంతో స్కూల్ కి వెళ్తాడు.
స్కూల్ కి వెళ్ళిన ఆదిత్య దేవి ని కలిసే ప్రయత్నం చేయగా.. మనసారా దేవిని హత్తుకునే సమయంలో మాధవ్ వచ్చి అడ్డుపడతాడు.. ఆదిత్య తనను ఎంతగా ప్రాధేయ పడుతున్నా కూడా పట్టించుకోకుండా.. దేవి, చిన్మయిని తీసుకెళ్ళి కారులో కూర్చుని పెడతాడు. ఆ ప్రయత్నంలోనే ఆదిత్య మాధవ్ కాలర్ పట్టుకుంటాడు. దాంతో మాధవ్ కి కోపం వచ్చి నా కలర్ పట్టుకుంటావా..!? ఈ జన్మలో నిన్ను దేవిని కలవనివ్వను.. కనీసం చూడడానికి కూడా ఒప్పుకోను.. అంటూ అక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని వెళ్ళి పోతాడు.. ఆదిత్య కార్ తీసుకొని పక్కనే ఉన్న గుట్ట మీద కు వెళ్తాడు గట్టిగా రుక్మిణీ రుక్మిని అంటూ అరుస్తాడు.. నాకు దేవి ని ఎందుకు దూరం చేశావు అని అనడంతో పెనిమిటి అంటూ ఒక పిలుపు వినిపిస్తుంది.. తీరా చూస్తే అది రుక్మిణీ నే.. నిజంగా రుక్మిణి గా వచ్చి రాధ తనతో నిజం చెబుతోందా..!? లేదంటే రేపు ఈ కథను ఏ విధంగా మలుపు తిప్పుతారో చూడాలి..