కెరియర్ పరంగా కొద్దిగా డౌన్ ఫాలో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ కి “పుష్ప” మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో పాటలు దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో మారు మ్రోగాయి. ఏకంగా ఐదు బిలియన్ వ్యూస్ “పుష్ప” వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. సినిమాలో ఐటమ్ సాంగ్ “ఊ అంటావా” ఇంకా శ్రీవల్లి…, దాకో దాకో మేక సాంగ్ ఎంతగానో ఆకట్టుకోవడం తెలిసిందే. దీంతో పుష్ప పాటలు భారీ ఎత్తున విజయం సాధించడంతో.. ఇప్పుడు “పుష్ప” రెండో భాగం కోసం మొదటి పార్ట్ తరహా సెట్టింగ్స్ ప్లాన్ చేయడం జరిగిందట. విషయంలోకి వెళ్తే సుకుమార్ “పుష్ప” రెండోభాగానికి సంబంధించి స్క్రిప్ట్ విషయానికి దాదాపు ఆరు, ఏడు నెలలు టైం తీసుకోవడం తెలిసిందే. అయితే ఫైనల్ టచ్ ఇటీవల ఇవ్వటం జరిగిందంట.
దీంతో దేవిశ్రీప్రసాద్ “పుష్ప” రెండో భాగానికి సంబంధించిన.. ట్యూన్స్ స్టార్ట్ చేశారట. ఈ క్రమంలో డిఎస్పి తో పాటు సుకుమార్…. బన్నీ కూడా కూర్చున్నట్లు సమాచారం. ఆల్రెడీ సినిమా స్టార్ట్ అవ్వకముందే మూడు సాంగ్స్ ఓకే అయినట్లు పుష్ప మొదటి భాగంలో కూడా ఇతరహాలోనే దేవిశ్రీ ప్రసాద్ పనిచేసినట్లు ఇండస్ట్రీలో టాక్. ఇదంతా పక్కన పెడితే సెకండ్ పార్ట్ లో ఐటెం సాంగ్ కి మాస్ బిట్స్ గతానికి భిన్నంగా దేవిశ్రీప్రసాద్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే “పుష్ప” మొదటి భాగం కంటే రెండో భాగం అత్యధికమైన భాషలలో తెరకెక్కిస్తున్నరట. అంతేకాదు ఈసారి ఎక్కువ టైం ప్రమోషన్ కార్యక్రమాలకు కేటాయించాలని డిసైడ్ అయ్యారంట. దీంతో పగడ్బందీగా “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ తొందరగా కంప్లీట్ చేసి దేశవ్యాప్తంగా భారీగా దాదాపు రెండు నెలలకు పైగానే ప్రమోషన్ కార్యక్రమాలు సినిమా యూనిట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవికి పుష్ప సెకండ్ పార్ట్ రిలీజ్ చేయనున్నట్లు టాక్.