వైవిధ్యమైన చిత్రాలు చేయడంలో హీరో ధనుష్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు ధనుష్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి దొరై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో (ఇంకా టైటిల్ పెట్టలేదు) కాగా… మరో చిత్రం వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అసురన్’. ఈ రెండు చిత్రాల్లోనూ ధనుష్ తండ్రి కొడుకులుగా నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం ‘అసురన్’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఓ కొండ ప్రాంతంలో ఓ సన్నివేశం కోసం ధనుష్ అండ్ టీం ఏకంగా ఆరు గంటల పాటు కష్టపడ్డారట. కెరీర్ ప్రారంభంలోనే కాదు.. స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా ధనుష్ పర్ఫెక్షన్ కోసం కష్టపడుతున్న ధనుష్ కమిట్ మెంట్ చూసి యూనిట్ ఆశ్చర్యపోయారట. ఈ సినిమాలో ధనుష్ సరసన మలయాళ నటి మంజు వారియర్ నటిస్తున్నారు.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!