బుల్లితెర ప్రఖ్యాత కమెడియన్ సుడిగాలి సుధీర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది అనే వార్తలు సోషల్ మీడియా లో ఎంతలా వైరల్ అవుతున్నయో తెలిసిందే. సుధీర్ కు కరోనా పాజిటివ్ అని ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు కానీ అతనితో పాటు ఇంకొంత మంది హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లి పోయారు అని తెలుస్తోంది.
ఒక్క సుధీర్ కు కోవిడ్ సోకటం తో చాలామంది చిక్కుల్లో పడ్డారు అన్న వార్తలు జోరందుకున్నాయి. ఎన్నో ఈవెంట్లుకి బ్రేకులు పడ్డాయి. సుధీర్ ఎన్నో అతి ముఖ్యమైన షో లలో యాంకర్. అసలు ఇప్పుడు దసరా పండుగ వాతావరణం నెలకొంది. పండగ స్పెషల్ ఈవెంట్ లు ప్రతి ఇంటిలో ఎంతటి సందడి చేస్తాయో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రోమోలపై ప్రోమో లతో దంచికొట్టడం మొదలెట్టేశారు.
ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఒకరితో ఒకరు పోటీ పడుతుంటాయి. ఇటువంటి సమయంలో సుధీర్ కు కరోనా పాజిటివ్ అని టాక్ రావడం అనేది నిజంగా దురదృష్టకరం. ఇక ఈ టీవీ లో దసరా ఈవెంట్ లో సుధీర్ పాల్గొన్నప్పుడు షూటింగ్ సమయంలోనే అతనికి కోవిడ్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. అదే కనుక నిజమైతే ఈవెంట్ లో పాల్గొన్న ప్రముఖులందరికీ ఇబ్బందే.
ఇక ప్రతి వారం అతను చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతనితోపాటు రష్మి, శేఖర్ మాస్టర్, వర్షిణి దసరా ఈవెంట్ లో పాల్గొన్నారు. అసలే శేఖర్ మాస్టర్ ఈ మధ్యనే కరోనా నుండి కోలుకొని సెట్ లోకి అడుగుపెట్టాడు. ఇలాంటి సమయంలో ఒక్కడి వల్ల ఢీ షో కి బ్రేకులు పడేలా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. ఇక పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.