టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరొకరు చేస్తూ ఉంటారు. ఒక హీరో దగ్గరికి వెళ్లిన కథ మరొక హీరో దగ్గరికి వెళ్లడం అతడు వెంటనే ఓకే చెప్పటం.. సినిమా తీయడం చకచక జరిగిపోతాయి. ఈ రకంగానే ఉదయ్ కిరణ్ దగ్గరకు వెళ్ళిన స్టోరీ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళగా వెంటనే.. ఓకే చెప్పి చేసేసారట. ఆ సినిమా మరేదో కాదు “అతడు”. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన “అతడు”.. సూపర్ విజయం సాధించింది. జైబేరి ప్రొడక్షన్స్ అధినేత మురళీమోహన్.. ఈ సినిమాకి నిర్మాత. ఈ క్రమంలో ఇటీవల ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త విషయాన్ని తెలియజేశారు.
“అతడు” సినిమా ప్రారంభంలో ఉదయ్ కిరణ్ తో చేయాలని భావించాం. అంతా ఓకే అయింది అని అనుకున్న టైంలో… మహేష్ బాబు తో చేయాల్సి వచ్చింది.. అని మురళీమోహన్ పేర్కొన్నారు. “చిత్రం” అనే మొదటి సినిమాతోనే ఉదయ్ కిరణ్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ సమయంలో ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు అతని నటన చూసి కచ్చితంగా భవిష్యత్తులో మంచి హీరోగా రాణిస్తారని భావించారు.
ప్రత్యేకంగా చిరంజీవి కూడా ఉదయ్ కిరణ్ ఎదుగుదల పెద్దల దగ్గర వినయం.. చూసి ఫ్యామిలీ మెంబర్ గా.. తీసుకోవాలని కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని భావించారు. కానీ అనుకోకుండా కొన్ని కారణాలవల్ల.. ఆ కార్యక్రమం ఆగిపోయింది. ఆ కార్యక్రమం అవ్వకముందు పెళ్లి అనుకున్న టైములో “అతడు” ఉదయ్ కిరణ్ తో చేయాలని భావించాం. అతనికి స్టోరీ కూడా చెప్పాము ఓకే చెప్పాడు. అయితే అనుకోని కారణాలవల్ల ఇక మహేష్ బాబుతో చేయాల్సి వచ్చింది.. అంటూ మురళీమోహన్ తనదైన శైలిలో కొత్త విషయాన్ని బయటపెట్టారు.