Dil Raju: తెలుగు చలనచిత్ర రంగంలో అగ్ర నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయడం జరిగింది. కెరియర్ ప్రారంభంలో ఫ్యామిలీ మరియు యూత్ సినిమాలను చేస్తూ వరుస విజయాలు అందుకున్న దిల్ రాజు ప్రస్తుతం కమర్షియల్ సినిమాలకు పెద్దపీట వేస్తు భారీ ప్రాజెక్టులు చేస్తున్నరు. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియా పర్వం కొనసాగుతోంది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకొని సినిమాలు నిర్మిస్తున్నారు.
పైగా సౌత్ సినిమాలకు దేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఇటీవల ఏర్పడింది. ఈ పరిణామంతో నిర్మాత ధీర్ రాజు దక్షిణాది సినిమా రంగంలో టాప్ మోస్ట్ హీరోలతో పాన్ ఇండియా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగా శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో “RC 15”, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా “వారసుడు” సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్ తో చేయబోయే సినిమా భారీ ప్రాజెక్టు రూపొందుతోంది. ఇక వారసుడు జనవరి 12వ తారీకు విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సౌత్ ఇండియా టాప్ మోస్ట్ హీరోతో దిల్ రాజు సినిమా ప్లాన్ చేసినట్లు సమాచారం.
విషయంలోకి వెళ్తే “కేజిఎఫ్” సినిమాలతో మంచి మాస్ ఇమేజ్ సంపాదించిన హీరో యాష్ తో భారీ ప్రాజెక్టు ప్లాన్ చేసినట్లు టాక్. “కేజిఎఫ్” రెండు సినిమాలు దేశంలో రికార్డు స్థాయి వసూలు రాబట్టయి. “కేజిఎఫ్ 2” ఏడాది ఏప్రిల్ నెల విడుదలై ఇండియాలోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం సంచలనం సృష్టించింది. దీంతో హీరో యాష్ కి తిరుగులేని ఇమేజెస్ సొంతం అయ్యింది. సో ఈ పరిణామాలతో హీరో యాష్ కి భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగిందట. త్వరలోనే డైరెక్టర్ అన్ని వివరాలు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!