Vakeel Saab : టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. ఇండస్ట్రీ లో అనేక విజయవంతమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన దిల్ రాజు..ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ అది తన డ్రీమ్ అంటూ బహిరంగంగా అనేకసార్లు తెలియజేయడం జరిగింది. అటువంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా నిర్మించే అవకాశం రావడంతో దిల్ రాజు “వకీల్ సాబ్” సినిమాని ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు.
వకీల్ సాబ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన నాటి నుండి భారీగా ఖర్చు చేస్తూ సినిమా కోసం ఎక్కడ రాజీ పడకుండా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. అందువల్లే లాక్ డౌన్ తర్వాత బ్యాలెన్స్ షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ కి స్పెషల్ ఫ్లైట్ కేటాయించటం మాత్రమే కాక పవన్ రాజకీయాలకు సినిమా షూటింగ్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా పవన్ పై ఉన్న తనలో అభిమానాన్ని బయటపెట్టాడు. ఇప్పుడు అదే తరహాలో భారతీయ చలనచిత్ర రంగంలో ఏ సినిమా హీరోకి జరగని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఈవెంట్ కోసం దాదాపు రెండున్నర కోట్లు ఖర్చు చేయాలని దిల్ రాజు డిసైడ్ అయ్యారట. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు అంటూ థియేటర్లు క్లోజ్ అయ్యే పరిస్థితి ఉన్నది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అదిరిపోయే ప్లానింగ్ తో “వకీల్ సాబ్” రిలీజ్ చేయబోతున్నారు దిల్ రాజు.
అతి తక్కువ రోజుల్లోనే సినిమాకి భయంకరమైన కలెక్షన్లు వచ్చే తరహాలో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో సినిమా ధియేటర్లు బుక్ చేయడం జరిగిందట. పవన్ కళ్యాణ్ కి వైజాగ్ ప్రాంతంలో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో .. అక్కడ రెండు థియేటర్లకు మిడ్ నైట్ షో లు వేసే బాధ్యత అప్పజెప్పినట్లు టికెట్ రేటు 1500/- ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక స్పెషల్ షోలు ఉదయం నాలుగు, ఏడు గంటలకు వేయాలని వాటికి 700/- రూపాయలు టికెట్ ధర నిర్ణయించినట్లు ఫిలిం వర్గాల టాక్. వైజాగ్ ప్రాంతంలో ఎక్కువ అభిమానులు ఉండటం వలన ఈ విధంగా భారీ స్థాయిలో అదిరిపోయే ప్లానింగ్ తో నిర్మాత దిల్ రాజు “వకీల్ సాబ్” రిలీజ్ చేయబోతున్నారట. దీంతో ఓపెనింగ్స్ భారీస్థాయిలో రికార్డు కలెక్షన్లు రావడం గ్యారెంటీ అని తాజా వార్త పై ట్రేడ్ వర్గాల టాక్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?