Dil Raju: టాలీవుడ్ టాప్ నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. ఎన్నో భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు.. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు.. 2017లో దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఒంటరి జీవితాన్ని గడిపిన దిల్ రాజు తేజస్విని వివాహం చేసుకున్నారు.. దిల్ రాజు తేజస్వినిమధ్య ఓ పెద్ద లవ్ ట్రాక్ నడిచిందట ఆ విషయాలను వారసుడు సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియా ముందుకు వచ్చిన దిల్ రాజు తన రెండో భార్య తేజస్విని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..
దిల్ రాజు తేజస్విని జంట ఓ మగ బిడ్డకు కూడా జన్మనిచ్చారు. అప్పట్లో దిల్ రాజు పై ట్రోల్స్ ఓ రేంజ్ లో జరిగాయి.. కాగా దిల్ రాజు తేజస్విని మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవతున్నాయి..
దిల్ రాజు తనకు ఎలా పరిచయమయ్యారని విషయాన్ని తేజస్విని చెబుతూ.. నేను అమెరికా వెళ్లి పీహెచ్ డీ చేయాలని అనుకున్నాను.. నేను ఎయిర్ లైన్స్ లో పనిచేస్తున్న సమయంలో దిల్ రాజు రెగ్యులర్ గా ట్రావెల్ చేసేవారు.. మేమిద్దరం మొదటిసారిగా కలిసినప్పుడు.. ఆయన నన్ను పెన్ అడిగారు.. అలా మా పరిచయం మొదలైంది.. ఇక నేను ఫ్లైట్ షిఫ్ట్ లో ఉన్న ప్రతిసారి ఆయన విమానంలో కనిపించేవారు.. ఇది మాత్రం ఆ దృశ్యకంగా జరిగేదని తేజస్విని వివరించారు.. అలా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చారు.
దిల్ రాజు కూడా ఈ విషయంపై మాట్లాడుతూ.. నా మొదటి భార్య అనిత మరణించే నాటికే 47 ఏళ్లు ఉన్నాయి. జీవితంలో ముందుకు వెళ్లాలి అనుకుంటున్నా సమయంలో రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. నా బిజీ లైఫ్ కారణంగా నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి కావాలనుకున్నాను. అప్పుడే నాకు తేజస్విని పరిచయమైంది. తన ఫోన్ నెంబర్ తీసుకొని సుమారు ఏడాది పాటు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఆ జర్నీ తర్వాత ప్రపోజ్ చేయడం.. ఆ తర్వాత కుటుంబంతో కలిసి చర్చలు జరపడం.. చివరికి పెళ్లి వరకు వెళ్ళింది అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇక తేజస్వినిలో తనకు నచ్చింది.. తను గ్రౌండ్ టు ఎర్త్ కావడమే అని తెలిపారు. ఇద్దరు వారి లవ్ ట్రాక్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.