Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ తరహాలో సినిమాలు తీయటంలో అనిల్ రావిపూడి స్టైలే వేరు. ఇండస్ట్రీలో ఇప్పటి దాకా తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తిరుగులేని గ్రాఫ్ తో అనిల్ రావిపూడి సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయమెరుగని డైరెక్టర్ లిస్టులో మొదట రాజమౌళి ఉండగా ఆ తర్వాత కొరటాల శివ, అనిల్ రావిపూడి ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో ఒక విషయం కూడా అందుకోలేకపోయిన అనిల్ రావిపూడి పూర్తి దర్శకుడిగా మారిన తర్వాత బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్నారు. పటాస్, సుప్రీమ్, రాజాదిగ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు ఇలా వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ నీ షేక్ చేసేస్తున్నాడు.
ప్రస్తుతం “ఎఫ్3” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. అయితే సమయంలో నందమూరి బాలకృష్ణ తో ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై సినిమా చిత్రీకరిస్తున్నాడు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు చేశారు. దర్శకుడిగా మారిన తర్వాత తన ఫస్ట్ సినిమా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో “పటాస్” చేస్తున్న సమయంలో… జూనియర్ ఎన్టీఆర్… మా ఆఫీస్ వద్దకు వస్తుండేవారు. అప్పుడు ఆయన నన్ను భయంకరంగా ర్యాగింగ్ చేసేవారు. ర్యాగింగ్ అంటే బాధ పెట్టడం మరియు ఇబ్బంది పెట్టడం కాదు. జోకులతో సెటైర్లతో బాగా అల్లరి చేసే వాళ్ళు. నాకు స్టోరీ చెప్పవా.. అంటూ సరదాగా అడిగేవారు. ఆ సమయంలో నా ఫస్ట్ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు ఏం చెప్పాలి అని నేనంటే… అయినా కానీ నాకు కథ చెప్పవా అంటూ బాగా ఆడుకునేవారు. జోవియల్ గా ఉండేవారు.
ఆయనతో అప్పటి సమయంలో గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను అంటూ అప్పటి తీపి జ్ఞాపకాలను తాజాగా అనిల్ రావిపూడి గుర్తు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల తో చేస్తున్న యాఫ్ త్రీ సినిమా.. వేసవి కానుకగా మే 27 వ తారీఖు రిలీజ్ చేయడానికి అన్ని పెండింగ్ పనులు శరవేగంగా.. అనిల్ రావిపూడి కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత నందమూరి బాలయ్య బాబు తో.. చేస్తున్న సినిమా చాలా తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే బాలయ్య బాబు తో చేస్తున్న సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ నిన్ననే విడుదల చేయడం జరిగింది. యాక్షన్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్నట్లు ఫస్ట్లుక్ బట్టి అర్థమవుతుంది.