Mahesh: సూపర్ స్టార్ మహేశ్ బాబు పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా అందగాడు ఎవరంటే.. అలనాడు శోభన్ బాబు తరువాత ఈనాడు మహేశ్ బాబు అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ రూపొందుతోన్న విషయం తెలిసినదే. 14 రీల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేశ్ బాబు కూడా సహ నిర్మాతగా వున్నాడు. స్పెయిన్, గోవా, దుబాయ్, హైదరాబాద్ లలో షూటింగ్ జరిగిన మహేష్ మోకాలు నొప్పి కారణంగా షూటింగ్ ఆగింది. సర్జరీ చేయించుకున్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నాడు. దాంతో త్వరలోనే షూటింగును మొదలుపెట్టేసే అవకాశం వున్నట్టుగా తెలుస్తోంది.
Home appliances:నూతన సంవత్సరంలో పెరగనున్న ధరలు.. ఇప్పుడే వాటిని కొనేయండి!
నిర్మాతలు మహేష్ ను కోరుతున్నదేంటి?
ప్రస్తుతం తెలుగు సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసినదే. దాంతో ‘సర్కారువారి పాట’ సినిమాను అదే స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. అయితే దానికి మహేశ్ సుముఖంగా లేడని తెలుస్తోంది. సర్కారు వారి పాట పాన్ ఇండియా స్థాయి కాదని మహేశ్ బాబు అంటున్నాడట. అయినా మిగతా వాళ్లు ఆయనను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Telangana High Court: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు..
సర్కారు వారి పాట ఎలా వుండబోతోంది?
దానికి ఆసక్తి చూపించని మహేశ్ బాబును వాళ్లు ఎంతవరకూ ఒప్పించగలుగుతారనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇక ఈ సినిమాను తెలుగులోనే భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మహేష్ అనుకుంటున్నాడట. దాదాపు 10000 థియేటర్ లలో సినిమాను ప్రదర్శించనున్నారట. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అది అసాధ్యం అని అందరు అనుకుంటున్నారు. ఇకపోతే పరశురామ్ ఈ సినిమాను తనదైన స్టైల్లో రూపొందిస్తున్నాడు. దాదాపు బ్యాంకు స్కామ్ చుట్టూ ఈ కథ తిరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.