Project K: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ కి సరైన హిట్టు పడలేదు. బాహుబలి 2 తో ఇండియాలో అతిపెద్ద విజయం సాధించిన కానీ.. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ రెండూ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలకు దాదాపు నాలుగు సంవత్సరాలకు పైగానే ప్రభాస్ టైం కేటాయించటం.. అభిమానులకు నిరాశ కలిగించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో “సలార్”, అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో ఓ సినిమా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తూ ఉన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదే తరుణంలో “మహానటి” డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా భారీ బడ్జెట్ సినిమా ప్రభాస్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. ప్రభాస్ సరసన బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇటువంటి తరుణంలో ఈ సినిమా గురించి సరికొత్త అప్డేట్ నాగ్ అశ్విన్ తాజాగా సోషల్ మీడియాలో తెలియజేశారు. గుర్తున్నారు ఇప్పుడే ఒక షెడ్యూల్ అయ్యింది.
ప్రభాస్ ఇంట్రడక్షన్ బిట్.. తో పాటు మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయింది. ప్రభాస్ చాలా కూల్. జూన్ నుండి మళ్లీ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. రిలీజ్ ఆర్డర్ లో మనమే లాస్ట్ కదా. ఇంకా ఫ్రీక్వెంట్ అప్ డేట్స్ ఇవ్వటానికి టైం ఉంది. ఈ సినిమా కోసం హీరో ప్రభాస్ తో పాటు అందరం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం.. అంటూ నాగ్ అశ్విన్ తెలియజేశారు. “ప్రాజెక్టు కె” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా వినూత్నమైన హీరో క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ కి హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఖరీదైన కెమెరాలతో… చిత్రీకరిస్తున్నట్లు ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం.