ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇటీవల సరికొత్త రికార్డులు సృష్టించిన సినిమా “కేజిఎఫ్ 2” అని అందరికీ తెలుసు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. సినిమా టేకింగ్, హీరో ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ లో చూపించడం జరిగింది. ఈ సినిమాతో రాజమౌళి తర్వాత దేశంలో టాప్ దర్శకుల జాబితాలో ప్రశాంత్ నీల్ జాయిన్ కావడం జరిగింది. దీంతో మనోడితో సినిమా చేయడానికి బాలీవుడ్ మొదలుకొని దక్షిణాది వరకు చాలామంది నిర్మాతలు మరియు హీరోలు క్యూ కట్టే పరిస్థితి నెలకొంది.
కన్నడ ఇండస్ట్రీ అనేది ఒకప్పుడు చిన్నది అని చెప్పే పరిస్థితి ఉంటే “కేజిఎఫ్” రిలీజ్ అయ్యాక కన్నడ ఇండస్ట్రీ రూపురేఖలు మొత్తం మారిపోయాయి. “కేజిఎఫ్” రెండు భాగాలు ఎన్నో సంచలనాలు సృష్టించటం జరిగింది. ఇండియా వ్యాప్తంగా ప్రశాంత్ నీల్ పేరు మారు మ్రోగే పరిస్థితి ఉన్న ఈ టైంలో ఆగస్టు 15వ తారీకు ఏపీలో తన సొంత గ్రామంలో పర్యటించి.. ఆసుపత్రి నిర్మాణానికి 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది. పూర్తి విషయంలోకి వెళ్తే సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం.. నీలకంఠాపురంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి “ఎల్వీ ప్రసాద్” అనే ఆసుపత్రి నిర్మిస్తున్నారు.
బంధుత్వపరంగా రఘువీరారెడ్డి తనకి తండ్రి లాంటి వారు అయిన క్రమంలో ఆ గ్రామంలో ఆయన కట్టించిన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన నిర్మిస్తున్న హాస్పిటల్ కి 50 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. అంతేకాదు తన పూర్తిపేరు ప్రశాంత్ నీలకంఠం అని కొత్త విషయాన్ని తెలియజేశారు. ఇదే సందర్భంలో ప్రభాస్ తో చేస్తున్న “సలార్”, ఇంకా ఎన్టీఆర్ ప్రాజెక్టుల గురించి అనేక విషయాలు ప్రశాంత్ నీల్ తెలియజేయడం జరిగింది.