డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడిగా ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు పరుశురాం. విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకేక్కించిన “గీతాగోవిందం”తో బ్లాక్ బస్టర్ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సర్కారు వారి పాట” తో మరో హిట్ అందుకోవడం తెలిసిందే. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో మహేష్ బాబుని చాలా అందంగా చూపించడంతో పాటు…సరి కొత్తగా సినిమాని తీయడంతో పరుశురామ్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా రొమాంటిక్ గా చిత్రీకరించడంలో పరుశురాం చాలా స్పెషలిస్ట్.
అటువంటి పరుశురాం “సర్కారు వారి పాట” తర్వాత తన నెక్స్ట్ సినిమా నాగచైతన్యతో అని తెలియజేయడం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నీ మళ్లీ రిపీట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం డిస్కషన్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క ప్రస్తుత పరిస్థితిలో రష్మిక మందన ఒప్పుకుంటుందా..? లేదా..? అనేది సస్పెన్స్ గా మారింది.
“పుష్ప” సినిమా విజయంతో రష్మిక మందన చాలా వరకు హై బడ్జెట్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అందులోనూ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ గుర్తింపురావడంతో..పాన్ ఇండియా ప్రాజెక్టులకు ఎక్కువ అవకాశం కల్పిస్తుంది. దీంతో పరుశురాం సినిమాకి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది సందేహంగా ఉంది. “సర్కార్ వారి పాట” విడుదలయ్యి మూడు నెలలు కావస్తున్న… పరశురాం.. నాగచైతన్యతో సినిమా స్టార్ట్ చేయడంలో ఆలస్యం కావటం రకరకాల చర్చలకు దారితీస్తుంది.