SVP: “సర్కారు వారి పాట” సినిమా డైరెక్టర్ పరుశురాం మొదటి నుండి తాను చేసే సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్ నీ సీరియస్ గా చూపిస్తుంటారు. ఆంజనేయులు, సోలో, గీతాగోవిందం వంటి సినిమాలలో పరశురామ్ హీరోయిన్లు హీరోలపై సీరియస్ అవుతూ… రొమాంటిక్ గా వ్యవహరిస్తూ ఉంటారు. దీంతో మహేష్ బాబుతో ప్రస్తుతం చేస్తున్న “సర్కారు వారి పాట” సినిమాలో కూడా హీరోయిన్ కీర్తి సురేష్ అదే తరహాలో నటిస్తుందని అభిమానులు అంచనా వేశారు.
కానీ మహేష్ బాబు కోసం పరుశురాం తన ట్రెండ్ మార్చినట్లు ఈ సినిమాలో చాలా ఫన్నీ క్యారెక్టర్… కీర్తి సురేష్ చేత చేయించడం జరిగిందట. సినిమాలో అసలు కీర్తి సురేష్ సీరియస్ అయ్యే పరిస్థితి ఉండదని… చాలావరకు మహేష్ యే మహానటి ని బాగా ఏడిపిస్తున్నారు అని సినిమా యూనిట్ నుండి అందుతున్న టాక్. పూర్తిగా గత సినిమాలకు భిన్నంగా హీరోయిన్ క్యారెక్టర్ ని ఈ సినిమాలో.. పరశురాం మార్చడం జరిగిందట. దీంతో సినిమాలో కీర్తి సురేష్ సీరియస్ గా ఉండే అవకాశం లేదని తాజా న్యూస్ లో తెలుస్తోంది. మరోపక్క ఈ సినిమా టీజర్ లేదా ఫస్ట్ లుక్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అవుతుందని మహేష్ అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా దేశంలో భయంకరమైన పరిస్థితిలు ఉన్న నేపథ్యంలో… సినిమా యూనిట్ నుండి ఎటువంటి అప్డేట్ వచ్చే అవకాశం లేదని సరికొత్త వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More: Mahesh Babu: ప్రాణదాతగా మారి..మరోసారి శ్రీమంతుడు అనిపించుకున్న మహేష్ బాబు..??
ప్రతి సంవత్సరం మే 31 తన తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు తాను నటించే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ మహేష్ ఇవ్వటం ఓ సెంటిమెంట్. గత ఏడాది సర్కారు వారి పాట సినిమా చేస్తున్నట్లు మే 31 కృష్ణ పుట్టినరోజు నాడు తెలియజేశారు. అయితే ఈసారి కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో… అనేక మరణాలు సంభవిస్తే ఉండటంతో ఈ సమయంలో సినిమా అప్డేట్ అనేది మంచిది కాదని.. సినిమా యూనిట్ డిసైడ్ అయ్యి కామ్ అయినట్టు సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!