Puri Jagannadh: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ ఏడాది ఆగస్టు నెలలో వచ్చిన “లైగర్” బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా కోసం ఏకంగా రెండున్నర సంవత్సరాలు పాటు కష్టపడ్డారు. వరుసపరాజయాలలో ఉన్న హీరో విజయ్ దేవరకొండకి “లైగర్” చాలా పెద్ద డ్యామేజ్ చేసింది. ఒక హీరోకి మాత్రమే కాదు సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు కూడా చాలా నష్టాలు వచ్చాయి. దీంతో విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ లో కొంత వెనక్కి కూడా ఇచ్చేయడం జరిగింది.
ఈ సినిమాకి దర్శకుడుగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా పూరి వ్యవహరించడంతో…”లైగర్” డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టానికి కొంత తాను భరిస్తానని మాట ఇచ్చారు. అయితే డిస్ట్రిబ్యూటర్లు పూరి మాట ఇచ్చినా గాని… చాలా దూకుడుగా వ్యవహరిస్తూ పూరి జగన్నాథ్ ఆఫీస్ వద్ద ధర్నాకి రెడీ అవ్వడంతో పూరి జగన్నాథ్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి ఆయన మాట్లాడిన ఆడియో లీక్ కూడా ఇటీవల వైరల్ అయింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా పూరి జగన్నాథ్ .. తన కార్యాలయం ముందు ధర్నా చేయటానికి రెడీ అవుతూ ఉండటంతో డిస్ట్రిబ్యూటర్ల పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హింసకు పాల్పడేందుకు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొన్న ఆడియోలో.. “అన్నా నేను మీకు మాట ఇచ్చాను. నాకు బయట నుండి కొద్దిగా అమౌంట్ రావాల్సి ఉంది. అది వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తాను. పరిస్థితి ఇలా ఉన్న సమయంలో మీరు ధర్నాకి దిగుతానని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే మాత్రం… ఇవ్వాలనుకుంటున్న రూపాయి కూడా ఇవ్వాలనిపించదు. ఆ తర్వాత మీ ఇష్టం.. అంటూ “లైగర్” డిస్ట్రిబ్యూటర్లతో పూరి జగన్నాథ్ మాట్లాడారు. తర్వాత ఇప్పుడు నేరుగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం సంచలనంగా మారింది.