ప్రస్తుతం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు మారుమొగుతున్న సంగతి తెలిసిందే. “బాహుబలి 2”, “RRR” సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన డైరెక్టర్ గా జక్కన్న రికార్డు క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన “RRR” తో హాలీవుడ్ రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదంతా పక్కన పెడితే జక్కన్న ఫామ్ తో ప్రస్తుతం ఇండియాలో టాప్ దర్శకులంతా పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇప్పుడు రాజమౌళి బాటలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ వెళ్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం పూరి చేస్తున్న సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే. “లైగర్”, “జనగణమన”. ఈ రెండిటిలో ముందుగా “లైగర్” ఈనెల 25వ తారీకు విడుదల కానుంది. పైగా ఈ రెండు సినిమాలలో హీరో విజయ్ దేవరకొండ అని అందరికీ తెలుసు. జక్కన్న పుణ్యమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియా హవా ప్రస్తుతం నడుస్తోంది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు చాలామంది టాప్ దర్శకులు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు చేయడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
దీంతో ఇప్పుడు రాజమౌళి బాటలోనే డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలు చేస్తున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇద్దరూ కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకులే. డైరెక్టర్ పూరి నెలలలోనే సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టే సత్తా కలిగిన డైరెక్టర్ కాగా మరొక డైరెక్టర్ సంవత్సరాలు తరబడి సినిమాలు చేస్తూ.. ఏకంగా ఇండియన్ బాక్సాఫీస్ మాత్రమే కాదు ప్రపంచ స్థాయిలో సత్తా చాటే దర్శకుడు. మరి పాన్ ఇండియా లెవెల్ లో పూరి ఏమాత్రం రానిస్తాడో చూడాలి.