ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్ సినిమాలు తీయాలంటే చాలామంది సంవత్సరాలు తరబడి సినిమాలు చేస్తారు. కానీ ఒక్క క్యారెక్టర్ పూరి జగన్నాథ్ మాత్రమే నెలలలో సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టే సత్తా కలిగిన డైరెక్టర్. ఆ రీతిగానే “పోకిరి” ఇంకా పలు సినిమాలతో తన డైరెక్షన్ దమ్ము ఏంటో నిరూపించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో పూరి సినిమా చేయడం జరిగింది. “లైగర్”తో పూరి జగన్నాథ్ ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేశారు.
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా… ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది. దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా పూరి జగన్నాథ్ వ్యవహరిస్తూ ఉండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అంతకుమించి అన్న తరహాలో…బాలీవుడ్ స్టార్స్ తో చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన నాటినుండి పూరి జగన్నాథ్ ముంబైలోనే ఉంటూ ఉన్నారు. పాండమిక్ మొదలవ్వకముందు నుండి.. ముంబైలో షూటింగ్ కార్యక్రమాలలో ఉండి దాదాపు రెండు సంవత్సరాలు పాటు.. పూరి జగన్నాథ్ టీమ్ అంతా ఒక హోటల్ లో బస చేయటం జరిగింది.
ఆ హోటల్ కి ఖర్చు మొత్తం దాదాపు 20 కోట్లకు పైగా అయినట్లు ఇది కూడా… సినిమా బడ్జెట్ లో భాగం అన్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ తన మకాం మొత్తం హైదరాబాదు నుండి ముంబైకి షిఫ్ట్ చేసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆల్రెడీ ముంబైలో పూరి జగన్నాథ్ ఒక ప్లాట్ కొన్నట్లు… త్వరలోనే.. ఆఫీస్ పెట్టనున్నట్లు సమాచారం. ఇకనుండి వర్క్ మొత్తం ముంబై నుండి చేయాలని పూరి జగన్నాథ్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.