RRR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ రోజు భేటీ కానున్నారు అని వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే “RRR” సినిమా విడుదల కానున్న తరుణంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… సినిమా టికెట్ ధర లకు సంబంధించి థియేటర్ ఓనర్ లను పెంచకుండా పది రోజులు అడ్డుకొనున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో.. డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి మరియు నిర్మాత డివివి దానయ్య జగన్ తో మాట్లాడాలి అని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇప్పటికే ఇద్దరూ విజయవాడకి చేరుకున్నట్లు మరికొద్ది సేపట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఈ ఇష్యూకి సంబంధించి… ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
“RRR” అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా కావడంతో… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం థియేటర్ల విషయంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉండటంతో పాటు.. డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉండటంతో… ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలతో టికెట్ల విషయంలో ఒక కన్ఫర్మేషన్ వచ్చాక అప్పటినుండి… ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని సినిమా యూనిట్ యొక్క ఆలోచన అట. “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన “RRR” పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాజమౌళి మరియు ఎన్టీఆర్ రామ్ చరణ్ కెరీర్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్ల విషయంలో ప్రస్తుతం ఉన్న ధరలకు సినిమా వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో .. టికెట్ ధర గురించి సీఎం జగన్ తో ప్రత్యేకంగా చర్చించనునట్లు సమాచారం.