సత్యం రాజేష్, నందిత కీలక పాత్రధారులుగా `విశ్వామిత్ర` సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రాజ్కిరణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు మైల్డ్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన గతంలో `గీతాంజలి`, `త్రిపుర`, `లక్కున్నోడు` సినిమాల్లో నటించారు. నందిత ప్రధాన పాత్రలో నటించిన `విశ్వామిత్ర` ఈ నెల 14న విడుదల కానుంది. ఎప్పుడు తన సినిమా విడుదలైనా విపరీతంగా ప్రమోషన్ చేసుకునే రాజ్కిరణ్ ఈ సారి సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులే ఉన్నప్పటికీ పెద్దగా హడావిడి కూడా ఏమీ చేయకపోవడం గమనార్హం. ఈ సినిమాలో అశుతోష్ రాణా, ప్రసన్న, విద్యుల్లేఖ రామన్ కీలక పాత్రల్లో నటించారు. మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్తో పాటు రాజ్కిరణ్ కూడా ఈ సినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరించారు. వాస్తవ ఘటనలతో రూపొందిన సినిమా ఇది. మనిషికీ, అతీత శక్తికీ మధ్య ఉన్న నిగూఢమైన అంశాలను స్పృశిస్తూ తెరకెక్కించారు.
previous post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!