(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
‘దిశ’ అత్యాచారం, హత్య కేసులో ఎన్ కౌంటర్ లో చనిపోయిన చెన్నకేశవులు దిశ జీవితాన్నే కాదు అతడు తన భార్య రేణుకను కూడా బాధితురాలిగా చేశాడని ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. దిశ అత్యాచారం, హత్య ఘటనల ఆధారంగా సినిమా రూపొందించనున్నానని ఇప్పటికే ప్రకటించిన వర్మ.. నేడు ఎన్ కౌంటర్ మృతుడు చెన్నకేశవరావు అతడి భార్య (17)తో భేటీ అయ్యారు. పలు అంశాలపై ఆమెతో చర్చించిన అనంతరం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ఇప్పుడే రేణుకను కలిశాను. ఆమె రేపిస్ట్ చెన్నకేశవులు భార్య. 16 ఏళ్ల వయసులో ఆమెను చెన్నకేశవులు పెళ్లి చేసుకున్నాడు. అతడి బిడ్డకు ఆమె 17 ఏళ్ల వయసులో జన్మనివ్వనుంది. దిశ జీవితాన్నే కాదు అతడు తన భార్యను కూడా బాధితురాలిగా చేశాడు. ఒక చిన్నారి అయ్యుండి ఆమె మరో చిన్నారికి జన్మనిస్తుంది. వారిద్దరికీ మంచి భవిష్యత్తు లేదు’ అని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.
నిర్భయ ఘటన తర్వాత కొత్తగా దోషులు ఏం నేర్చుకుంటున్నారో ‘దిశ’ చిత్రం ద్వారా భయంకరమైన గుణపాఠంగా తెలపనున్నామని వర్మ ప్రకటించారు.