RGV: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ తర్వాత రాజకీయ నేపథ్యంలో రెండు సినిమాలు చేస్తున్నట్లు ద్వారా ప్రకటించడం సంచలనం సృష్టించింది. “అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ , రాజకీయ కుట్రల విషంతో నిండి వుంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం. ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం” , 2nd పార్ట్ “శపథం” .. రెండింటిలోనూ రాజకీయఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి.
రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది. వ్యూహం “ చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక, ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు.”…అని ట్వీట్టర్లో తెలియజేశారు. దీంతో ఆర్జీవి పెట్టిన పోస్ట్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వ్యూహం, శపథం కథలు ఎలా ఉంటాయి అనే డిస్కషన్లు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో ఈ డిస్కషన్ జరుగుతూ ఉండగానే ఆర్జీవి మరో పోస్ట్ ట్విట్టర్ లో పెట్టడం జరిగింది. “BJP÷PK×CBN-LOKESH+JAGAN =వ్యూహం” అని ఈక్వేషన్ ఇవ్వటంతో ఇప్పుడు ఇది మరింత చర్చినియాంశంగా మారింది. ఈ సినిమాని గతంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన “వంగవీటి” సినిమా నిర్మాత దర్శకుడు దాసరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీంతో ఆర్జీవి “వ్యూహం” ఎవరిపై అన్నది ఇప్పుడు మరింత డిస్కషన్ క్రియేట్ చేసింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!