వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తర్వాత చిత్రం లో మొత్తం మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేశాడు. అతని తదుపరి చిత్రం టైటిల్ ‘అల్లు’ అన్న విషయం తెలిసిందే ఇకపోతే ఈ సినిమా మెగా ఫ్యామిలీ లోని స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పైన ఉంటుందని అందరూ చెబుతున్నారు.
ఇక చిరంజీవి లాంటి పెద్ద స్టార్ ఉన్న ఫ్యామిలీకి అల్లుఅరవింద్ ఏం చేశాడు అనే ఒక ఫిక్షనల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించాడు. పైకి మాత్రం వాళ్ళ పేర్లు మార్చినా… చిరంజీవి మరియు అల్లు అరవింద్ దీనిలో పాత్రలు అని అందరికీ అర్థం అవుతుంది. ఇకపోతే ఈ చిత్రం ద్వారా అల్లుఅరవింద్ లోని మరో కోణం ఉన్నట్లు చూపించి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అల్లు అరవింద్ ఏదో చేశాడని గడబిడి చేశాడని అతనిపై విమర్శలు ఉంటే… వాటిని టార్గెట్ చేస్తూ వర్మ సినిమా తీస్తున్నాడని స్పష్టంగా అర్థం అవుతుంది. అందుకే అతను స్టోరీ ‘జన రాజ్యం’ పార్టీని ఒక పాపులర్ హీరో స్థాపించిన తర్వాత ఏర్పడిన పరిస్థితులపై తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. ‘ప్రజారాజ్యం’ పార్టీని ‘జన రాజ్యం’ పార్టీ గా వర్మ మార్చినట్లు మనకి అర్థమవుతుంది.
ఇకపోతే ‘అల్లు’ సినిమాలో అల్లు అరవింద్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, శిరీష్, రామ్ చరణ్, నాగబాబు తదితరుల పేర్లను మార్చి పాత్రలుగా ప్రవేశపెడుతున్నట్లు వర్మ చెప్పాడు. ఎంతైనా వర్మ ఇలా డైరెక్ట్ గా వారిని టార్గెట్ చేసినట్లు చేయడం చాలా ధైర్యం చెప్పాలి. అదీ పవన్ అభిమానులు అతని ఆఫీసుకి వెళ్లి నానా హంగామా చేసిన తర్వాత కూడా ఈ ధైర్యం నిజంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.