Pushpa 2: “పుష్ప 2” షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఇటీవల సినిమా యూనిట్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి.. రష్యలో “పుష్ప” ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరిగి హైదరాబాద్ కి చేరుకున్న సినిమా యూనిట్.. మళ్లీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ డిసెంబర్ 17వ తారీకుకి “పుష్ప” మొదటి భాగం విడుదల అయి ఏడాదికావస్తుండటంతో…”పుష్ప 2″కి సంబంధించి ఫస్ట్ అప్డేట్ ఇవ్వటానికి సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే దర్శకుడు సుకుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సరికొత్త ప్లాన్ వేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
విషయంలోకి వెళ్తే “పుష్ప 2″లో చెర్రీ కి ఒక అతిథి పాత్ర సపరేటుగా సుక్కు డిజైన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. “RRR” తో చరణ్ అంతర్జాతీయంగా మంచి పాపులారిటీ సంపాదించడంతో ఈ రీతిగా.. “పుష్ప 2″తో సుకుమార్ ఇంటర్నేషనల్ మార్కెట్ పై మరింతగా దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే మెగా అభిమానులకు “పుష్ప 2” ఫుల్ మీల్స్ సినిమా అని చెప్పవచ్చు. గతంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో “ఎవడు” సినిమాలో అల్లు అర్జున్, చరణ్ కలిసి నటించడం జరిగింది.
కానీ ఆ టైంలో ఇద్దరు ఒక ఫ్రేమ్ లో పెద్దగా కనిపించలేదు. చరణ్ ప్రధాన పాత్రలో వచ్చిన “ఎవడు” అప్పట్లో హిట్ అయింది. మళ్లీ చాలాకాలం తర్వాత బన్నీ సినిమాలో చరణ్ నటించనున్నట్లు “పుష్ప 2″లో అతిధి పాత్రలో మెరువనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై సినిమా యూనిట్ స్పందించాల్సి ఉంది. “పుష్ప” మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావటంతో.. దానికి మించి ఉండే రీతిలో.. స్క్రిప్ట్ విషయంలో ఇంకా పాత్రల విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. “పుష్ప” మొదటి భాగం కంటే సెకండ్ పార్ట్ ఎక్కువ భాషలలో విడుదల చేస్తున్నారు.