Pushpa: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ బన్నీతో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా సుకుమార్ ప్రజెంట్ చేయటం మాత్రమే కాక బన్నీ మేకోవర్ మొత్తం మార్చడంతో…పాటు సినిమాలో చిత్తూరు యాస తరహాలో భాష ఉండటంతో సినిమాపై అభిమానులకు సామాన్య సినీ ప్రేమికులకు ఎంతో ఇంట్రెస్ట్ నెలకొంది.
ఇదిలా ఉంటే సెకండ్ పార్ట్ లో హీరోయిన్ రష్మిక మందన బదులు మరొక హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అంతమాత్రమే కాకుండా సెకండ్ పార్ట్ విషయంలో మరో సంచలన నిర్ణయం సుకుమార్ ఇటీవల తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మేటర్ లోకి వెళ్తే.. “పుష్ప” సెకండ్ పార్ట్ టైటిల్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారట. సెకండ్ పార్ట్ పుష్ప పూర్తి వేరియేషన్ గా చూపించాలని సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
Read More: Pushpa Movie: హీరోయిన్ రష్మిక మందన కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుకుమార్..??
ఏది ఏమైనా మాత్రం బడ్జెట్ భారీగా పెట్టడంతో రెండు పార్టులుగా సినిమా విడుదల చేయటం వల్ల నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉంటారని సుకుమార్ ఈ ఐడియాతో అనేక మార్పులు చేర్పులు రెండో భాగానికి చేస్తున్నట్లు వైరల్ వార్తలు వినబడుతున్నాయి. ఫస్ట్ టైం పాన్ ఇండియా తరహాలో సుకుమార్ అల్లు అర్జున్ ఒకేసారి అడుగుపెడుతూ ఉండటంతో పుష్ప సినిమాకి సంబంధించి ప్రతి సన్నివేశం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ రావాలి అన్న రీతిలో తెరకెక్కించారు అని సినిమా యూనిట్ నుండి అందుతున్న టాక్.