Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్ అందరికీ సుపరిచితుడే. 2000 సంవత్సరంలో “చిత్రం” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ … స్టార్టింగ్ లో వరుస విజయాలు అందుకున్నారు. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత “నువ్వు నేను” సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాని కూడా డైరెక్టర్ తేజ తీయడం జరిగింది. వరుస ప్రేమ కథ నేపథ్యంలో సినిమాలు చేసి విజయాలు అందుకుని టాలీవుడ్ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో పాటు చేస్తున్న సినిమాలు ప్లాపులు కావడంతో… 2014వ సంవత్సరం జనవరి నెలలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
అయితే ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు..? ఆయన చనిపోవడానికి గల కారణాలు ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే ఉండిపోయింది. చాలావరకు అవకాశాలు లేక.., ఇంకా చేస్తున్న సినిమాలు సరిగ్గా ఆడటం లేదని కెరియర్ డౌన్ ఫాల్ నీ బ్యాలెన్స్ చేసుకోలేక చనిపోయినట్లు భావిస్తూ వచ్చారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనకాల ఇండస్ట్రీ పెద్దల హస్తం ఉందన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో… డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉదయ్ డెత్ మిస్టరీకి గల కారణం తనకు తెలుసని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తనతో ఫోన్ లో మాట్లాడడాని జరిగిందంతా చెప్పాడని దర్శకుడు తేజ అన్నారు. అయితే ఇప్పుడే ఆ విషయాలు బయటపెట్టను. కానీ కచ్చితంగా నేను చనిపోయే లోపు ఉదయ్ కిరణ్ ఎందుకు చచ్చిపోయాడు… మొత్తం బయట పెడతా అంటూ డైరెక్టర్ తేజ చేసిన కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.