Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ ఇచ్చి “వకీల్ సాబ్” సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించాడు. ఏమాత్రం బాక్సాఫీస్ దగ్గర తన జోరు తగ్గలేదని “వకీల్ సాబ్” ఓపెనింగ్ కలెక్షన్లతో అది కూడా పాండమిక్ సిచువేషన్ లో ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయే రీతిలో పవన్ కళ్యాణ్ కలెక్షన్లు కొల్లగొట్టాడు. దాదాపు మూడు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న… ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన గాని సినిమా పరంగా మాత్రం పవన్ కళ్యాణ్ శిఖరం అని మరోసారి “వకీల్ సాబ్” సినిమా ద్వారా అందరికీ అర్థం అర్థమైంది.
స్టోరీ పరంగా ఆడవాళ్ళ మనోభావాలకు సంబంధించిన సినిమా అయినా గాని పవన్ కళ్యాణ్ ని సరికొత్త రీతిలో లాయర్ పాత్రలో చూపించడంలో డైరెక్టర్ వేణు శ్రీరామ్ నూటికి నూరు మార్కులు సాధించడాని చెప్పవచ్చు. దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అవటంతో మెగా అభిమానులలో వేణు శ్రీరామ్ పేరు డబల్ త్రిబుల్ అయింది. పరిస్థితి ఇలా ఉండగా మరో మెగా కాంపౌండ్ హీరోతో సినిమా చేయటానికి వేణు శ్రీరామ్ రెడీ అయినట్లు సమాచారం.
పూర్తి విషయంలోకి వెళ్తే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కి ఇటీవల స్క్రిప్టు వినిపించినట్లు అంతా ఓకే అయినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్. గెలవాలంటే వేణు శ్రీరామ్ అప్పట్లో అల్లు అర్జున్ తో చేద్దామని అనుకున్న “ఐకాన్” సినిమా ని ప్రస్తుతం సాయి ధరంతేజ్ తో కానిచ్చేద్దాం ఆ స్క్రిప్ట్ వినిపించినట్లు ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ “రిపబ్లిక్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది త్వరలోనే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ రావడంతో థియేటర్లో క్లోజ్ అవ్వటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.