ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ హీరోగా మారుతున్నాడు. అదేంటి ఎందరో స్టార్ హీరోలతో సినిమా చేసిన వినాయక్ ఉన్నట్లుండి కథానాయకుడిగా మారడానికి కారణమేంటనే సందేహం రాకపోదు. కానీ ఇది నిజం.. `శరభ` ఫేమ్ నరసింహారావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుండగా.. దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. “నిర్మాతగా జర్నీని ప్రారంభించి 16 ఏళ్లు అవుతుంది. మా సక్సెస్ఫుల్ జర్నీలో నన్ను దిల్ సినిమాతో దిల్రాజుగా మార్చిన వినాయక్గారిని హీరోగా పెట్టి సినిమా తీయబోతున్నాను. ఆయనకు తగ్గ కథ దొరికింది మరికొన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాను“ అని దిల్రాజు తెలిపారు. `మహర్షి` సక్సెస్ సందర్భంగా దర్శకుడు వంశీ పడిపల్లితో తిరుమలను సందర్శించుకున్న దిల్రాజు ఈ విషయాన్ని తిరుమలలో అనౌన్స్ చేశారు.
previous post
next post