KGF 2: రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఇద్దరూ ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్ లుగా చలామణి అవుతున్నారు. “బాహుబలి” తో జక్కన్న, “కేజిఎఫ్” తో ప్రశాంత్ నీల్ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందటం తెలిసిందే. ఇద్దరు డైరెక్టర్లు సినిమా చేస్తా అంటే నిర్మించడానికి బడా నిర్మాతలు లైన్ కట్టే పరిస్థితి నెలకొంది. ఏన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి అయినా ప్రొడ్యూసర్ లు రెడీగా ఉంటున్నారు.
వీళ్లిద్దరి దర్శకత్వంలో వచ్చిన “ఆర్ఆర్ఆర్”, “బాహుబలి”, “కేజిఎఫ్”… మూడో కూడా కళ్ళు చెదిరే కలెక్షన్లు రికార్డు స్థాయిలో కలెక్ట్ చేయడం జరిగింది. దీంతో ఇద్దరి దర్శకులతో దేశవ్యాప్తంగా ఉన్న చాలా టాప్ హీరోలు సినిమాలు చేయడానికి మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇండియాని ఇంత షేక్ చేస్తున్నా… రాజమౌళి మరియు ప్రశాంత్ నీల్..కి సంబంధించి కామన్ గా నచ్చినది ఒకటి ఉంది. అదేమిటంటే ఈ ఇద్దరి హీరోలకు.. ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇద్దరికీ కూడా చిరంజీవి అంటే ఆదర్శమని తాజాగా బయటపడింది.
“ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలలో రాజమౌళి తెలియజేయగా తాజాగా… “కేజిఎఫ్ 2” ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రశాంత్ నీల్ తెలియజేయడం జరిగింది. “కేజిఎఫ్ 2” ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా యూనిట్ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్.. చిరంజీవి తనకి 90 లలో ఫేవరెట్ హీరో అని.. చెప్పుకొచ్చారు. ఆయన సినిమాలు అప్పట్లో హీరోయిజానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండేవని చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో హీరో యాష్ మాట్లాడుతూ…హైదరాబాద్ కి ఎప్పుడొచ్చినా చరణ్ చాల అప్యాయంగా పలకరిస్తారు. నాకు చరణ్ మంచి ఫ్రెండ్ అని చెపుకురావడం విశేషం. ఇదిలా ఉంటె ప్రస్తుతం “కేజిఎఫ్ 2” థియేటర్ లలో సందడి చేస్తోంది. చాలావరకు పాజిటివ్ టాక్ అంతటా వస్తూ ఉండటంతో “కేజిఎఫ్ 2” సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు వార్తలు వైరల్ అవ్వుతున్నాయి.