Prabhas: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిన `లోఫర్` మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన హాట్ బ్యూటీ దిశా పటాని.. ప్రస్తుతం బాలీవుడ్లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. అయితే లోఫర్ తర్వాత మరో తెలుగు సినిమా చేయని దిశా.. తాజాగా ప్రభాస్ సినిమా అయిన `ప్రాజెక్ట్ కె`లో నటించే అవకాశాన్ని అందుకుంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో దిశా పటానీ మరో హీరోయిన్గా కనిపించబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా వెల్లిండించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే తన సినిమాలో భాగమైన దిశా పటానీకి తాజాగా ప్రభాస్ విందు భోజనం పంపించాడు. ప్రభాస్ విందు అంటే ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ విందు భోజనానికి ఎవ్వరైనా ఫిదా అవ్వకుండా ఉండలేరు. వెరైటీ వెరైటీ వంటలతో తన కో ఆర్టిస్టులను వేరె లెవల్లో మిస్మరైజ్ చేస్తుంటాడు.
ఇక ప్రభాస్ నుంచి విందు భోజనం అందుకున్న తారలు.. ఆ వంటలని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే దిశా పటానీ కూడా ప్రభాస్ పంపిన లంచ్ ఐటెమ్స్ను ఫొటో తీసి ఇన్స్టా ద్వారా పంచుకుంది. అంతేకాదు, `ఇలా ఫుడ్ పెట్టి నన్ను బాగా చెడగొడుతున్నందుకు థ్యాంక్స్` అని కామెంట్ పెట్టింది. దీంతో ఈమె పోస్ట్ కాస్త వైరల్గా మారింది.