Johnny Depp: “పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్” (pirates of the caribbean )సీరిస్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా దక్కించుకున్న హీరో జానీడెప్. ఇటీవల జానీడెప్(Johnny Depp) తన భార్యకి విడాకులు ఇచ్చి.. కోర్టు వాదనలతో మొన్నటి వరకు వార్తల్లో నిలిచాడు. చివరకు ఆ కేసు గెలవడం తెలిసిందే. హాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ నిర్మాణ సంస్థలలో డిస్నీ సంస్థ ఒకటి. ఈ ప్రముఖ నిర్మాణ సంస్థలో వచ్చిన అన్ని సినిమాలలో “పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్” సీరిస్ సినిమా హైలెట్. ఈ సిరీస్ లో జానీడెప్ చేసిన కెప్టెన్ జాక్ స్పారో(Jack Sparrow).. పాత్ర ..ఆ గెటప్ ఇంకా లుక్.. పిల్లలనుండి పెద్దలను ఎంతగానో అలరించింది. అయితే ఇప్పుడు మళ్లీ అదే పాత్ర జానీడెప్ తో చేయించడానికి డిస్నీ నిర్మాణ సంస్థ రెడీ అయినట్లు ఇందుకోసం దాదాపు 2535 కోట్లు ఆఫర్ చేసినట్లు టాక్.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే గతంలో జానీడెప్ తో డిస్నీ నిర్మాణ సంస్థ యాజమాన్యానికి వివాదం తలెత్తడం జరిగింది. కెప్టెన్ జాక్ పాత్ర ఆపేయాలని డిస్నీ సంస్థ భావించడంతో జానీడెప్ ..కి డిస్నీ సంస్థకి మధ్య వివాదం ఏర్పడింది. ఆ సమయంలో వారితో కాంట్రాక్ట్ చేసుకున్న సినిమాలు అన్నిటినీ రద్దు చేసుకుని మరి బయటికి వచ్చేశాడు. అదే సమయంలో డిస్నీ సంస్థ కూడా కెప్టెన్ జాక్ పాత్ర.. తీసేసినట్లు, జానీడెప్..తో ఒప్పందం రద్దు చేసుకున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది.
అయితే అనంతరం ఆ సంస్థ నుండి విడుదలైన “డెడ్ మ్యాన్ టేల్స్” (Dead Men Tell No Tales)
అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఇప్పుడు డిస్నీ నిర్మాణ సంస్థ…తిరిగి జానీడెప్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ సందర్భంగా డిస్నీ నిర్మాణ సంస్థ.. గతంలో తలెత్తిన వివాదం గురించి జానీడెప్ కి లెటర్ ద్వారా క్షమాపణలు తెలియజేస్తూ.. మళ్ళీ తిరిగి రావాలని కోరుతూ.. సంస్థలో కొనసాగలని… ఇందుకోసం ఏకంగా రూ.2,355 కోట్ల ($301 మిలియన్) డీల్ ఆఫర్ చేసినట్లు హాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్. తిరిగి “పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్”(pirates of the caribbean ) లేటెస్ట్ సిరీస్ కోసం జానీడెప్ తో ప్రస్తుతం మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో.. వేల కోట్లలో ఆఫర్ చేయడంతో హాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.