Aacharya: కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో “ఆచార్య” తెరకెక్కడం తెలిసిందే. 2019 చివరిలో “సైరా” సినిమా రిలీజ్ అయిన తర్వాత… “ఆచార్య” షూటింగ్ స్టార్ట్ కాగా.. కరోనా రావటంతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా షూటింగ్ చిరంజీవి ప్రభుత్వాలు చెప్పక ముందే ఆపేశారు. అయితే ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తేసిన ఈ క్రమంలో.. మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయగా ఆ తర్వాత మళ్ళీ కేసులు పెరగటం రకరకాలుగా.. “ఆచార్య” షూటింగ్ కి అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి.
ఆ తర్వాత వ్యాక్సిన్ రావటం మల్లి చిరంజీవి ఏకధాటిగా షూటింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం తెలిసిందే. ఏప్రిల్ మాసంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఏప్రిల్ రెండో వారం నుండి “ఆచార్య” ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. కాగా ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ తేజ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం తెలిసిందే. అంతకుముందు వీరిద్దరూ “మగధీర” సినిమా… రెండు మూడు నిమిషాలు మాత్రమే కనిపించగా ఆ తర్వాత “బ్రూస్ లీ” సినిమాలో నటించడం జరిగింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో దాదాపు నలభై నిమిషాలు చరణ్ పాత్ర ఉండే పోతున్నట్లు అందులో… 20 నుండి 25 నిమిషాలపాటు చిరంజీవితో చరణ్ కనిపించనున్నట్లు లేటెస్ట్ టాక్. ఇద్దరూ కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులను అభిమానులను ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేసే తరహాలో అవుట్ పుట్ వచ్చినట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. వేసవి సందర్భంగా ఏప్రిల్ 29వ తారీకు ఆచార్య విడుదల చేస్తున్నారు. “ఆర్ఆర్ఆర్” సూపర్ డూపర్ హిట్ కావడంతో చరణ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అయితే “ఆచార్య” సినిమాకి తానే నిర్మాత కావడంతో.. చరణ్ ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు ఏప్రిల్ రెండో వారం నుండి సరికొత్తగా చేసే ఆలోచనలో ఉన్నట్లు మెగా కాంపౌండ్ నుండి అందుతున్న టాక్.