RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీశ్ కలిసి భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా అలరించబోతోంది.
అలాగే శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రను పోషించారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని అంటున్నారు. చరణ్ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడని.. అందులో ఓ పాత్ర పొలిటీషియన్ అయితే, మరొకటి ఐఏఎస్ ఆఫీసర్ పాత్రని టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ మూవీలో విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ హీరోను శంకర్ సంప్రదించాడట. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. కానీ, సదరు హీరో మాత్రం శంకర్ ఆఫర్కు సున్నితంగా నో చెప్పాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. మోహన్ లాల్.
ఆర్సీ 15లో అవినీతికి పాల్పడే ఓ బడా రాజకీయ నాయకుడిగా విలన్ పాత్రను శంకర్ డిజైన్ చేశాడట. అయితే అటువంటి విలన్ క్యారెక్టర్ తనకు సూట్ అవ్వదని భావించిన మోహన్ లాల్.. శంకర్ అడిగిన వెంటనే చేయనని చెప్పినట్లు ప్రస్తుతం జోరుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.