అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయాల్లోనూ ముందుంటున్నారు గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తనదైన స్టైల్ ను మెయిన్ టెన్ చేస్తూ సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మన కాటమరాయుడు. కాగా లాక్ డౌన్ తర్వాత సినిమాలకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఈ షూటింగ్ హైదరాబాద్ లోని మియాపూర్ లో జరుగుతోంది. దానితో పవన్ మెట్రో రైలులో ప్రయాణించారు. మాదాపూర్ నుంచి మియాపూర్ వెళ్లే రైలులో ప్రయాణించి తోటి ప్రయాణికులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ ప్రయాణంలో భాగంగా పవన్ కళ్యాణ్ ద్రాక్షారామం రైతు చిన సత్యనారాయణతో ముచ్చటించారు.
వాళ్ల గ్రామ పరిస్థితుల గురించి, పాడి పంటల గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు పవర్ స్టార్. సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవలె కురిసిన వానల మూలంగా పంటలు పూర్తిగా దెబ్బతిని మా పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని ఆ రైతు చెప్పుకొచ్చారు. అలాగే తనకు ఈ మెట్రో ప్రయాణం కొత్తని రైతు చెప్పగా పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రయాణం నాకు కూడా కొత్తేనని అతనితో చెప్పి నవ్వించారు.
మొత్తంగా స్టార్ హీరో తనతో మాట్లాడటం వల్ల ఆ రైతు సంతోషం వ్యక్తం చేశారు. పవర్ స్టార్ చేస్తున్న వకీల్ సాబ్ మూవీ ఈ సంక్రాంతి కానుకగా 2021 కు విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్లలు ఉన్నారు. అలాగే ఈ సినిమాలో కథానాయికగా పవన్ సరసన శృతి హాసన్ నటించింది. బాలీవుడ్ పింక్ మూవీ రీమెక్ గా వస్తున్న వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.