Prabhas: నేషనల్ స్టార్ ప్రభాస్ నుండి దాదాపు మూడేళ్ల తర్వాత వచ్చిన చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బిలో యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ విడుదలైన వెంటనే షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకుని ప్రభాస్ స్పెయిన్ వెళ్లారు.
రెస్ట్ కోసం అనుకున్నారు కానీ మోకాలి శస్త్ర చికిత్స కోసం అని తెలిసింది. కొద్ది రోజుల క్రితం షూటింగ్ లో జరిగిన గాయం తిరగబెట్టింది. దాంతో స్పెయిన్ వెళ్లి సర్జరీ చేయించుకున్నారు. దీని కారణంగా దాదాపు నెల రోజులు రెస్ట్ మోడ్లో ఉన్న ప్రభాస్.. మరో రెండు నెలల పాటు అజ్ఞాతంలోనే గడపబోతున్నారని టాక్ నడుస్తోంది.
అయితే సర్జరీ నుండి కోలుకున్నా ప్రభాస్ షూటింగ్స్లో పాల్గొనడానికి ఎందుకంత టైమ్ తీసుకుంటున్నారు అని ఆరా తీయగా.. ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ప్రభాస్ ప్రముఖ దర్శకుడు మారుతితో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ తన మేకోవర్ను పూర్తిగా మార్చుకోబోతున్నాడట.
బ్లాక్ బస్టర్ హిట్ మిర్చి మూవీలో తనకు బాగా కలిసొచ్చిన స్లిమ్ లుక్స్ కోసం ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడట. అందుకోసమే ఆయన ఎక్సట్రా లీవ్ తీసుకుంటున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన ఓం రౌత్ తో `ఆదిపురుష్`, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో `ప్రాజెక్ట్-కె`, సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` చిత్రాలు చేస్తున్నాడు.