Samantha Ruth Prabhu: హీరోయిన్ సమంత మయోసిటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సమంత పెట్టిన పోస్ట్ కి ఇండస్ట్రీ నుండి చాలామంది రియాక్ట్ అవుతున్నారు. త్వరగా కోలుకోవాలని అంటున్నారు. ఆల్రెడీ నువ్వు ఈ వ్యాధిని “యశోద” సినిమాలో జయించావని… కామెంట్లు పెడుతూ సమంతకి ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క సమంత అభిమానులు భగవంతునికి ప్రార్ధనలు చేయడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో మయోసిటిస్ వ్యాధి తీవ్రత గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ కూడా చేస్తున్నారు. అయితే ఈ వ్యాధి తీవ్రత గురించి వైద్యులు తెలియజేస్తున్నది ఏమిటంటే..మయోసిటిస్ వ్యాధితో బాధపడుతున్న వాళ్లకి ఎక్కువగా కండరాలు వాపు ఉంటుందట. ఒంటిపై గాయాలు లేదా బాడీ ఇన్ఫెక్షన్ కి గురైన గాని … రోగ నిరోధక శక్తి క్షీణించిన ఈ వ్యాధి వస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు.
కండరాలు బలహీన పడిపోతాయి. కొద్దిగా పని చేసినా ఇంకా నడిచిన, నిలబడినా గాని త్వరగా అలిసిపోతారు. శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడతారు. ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అంగవైకల్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దిశగా మరణం కూడా సంభవించవచ్చు అని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ మయోసిటిస్ వ్యాధిని నయం చేసుకోవాలంటే ఫిజియోథెరపీ, హీట్ థెరపీ… ఇంకా వ్యాయామంతో నయం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. మరోపక్క సమంత తనకున్న కండిషన్ బట్టి ఈ వ్యాధి నయం అవడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ పట్టొచ్చు అని తెలియజేయడం జరిగింది.
ఏది ఏమైనా మొన్నటి వరకు వరుస సినిమాలతో బిజీగా ఉంటూ.. ఊ అంటావా సాంగ్ తో ప్రపంచం మొత్తాన్ని ఊపేసిన.. సమంత మయోసిటిస్ అనే ప్రాణాంతకర వ్యాధితో బాధపడుతున్నట్లు వార్త రావటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకి ఈ వ్యాధి వచ్చినట్లు ఇంస్టాగ్రామ్ లో సమంత పెట్టిన పోస్ట్ కి ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు రియాక్ట్ అవుతూ సమంతకి ధైర్యం చెబుతున్నారు.