Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటించిన చిత్రం `రాధేశ్యామ్`. కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు కలిసి నిర్మించారు. రెబల్ స్టార్ కృష్టంరాజు, జగపతిబాబు, సత్యరాజ్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు.
యూరప్ బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ లవ్స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉన్నా.. ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో మార్చి 11కు షిఫ్ట్ అయింది. ఇకపోతే ఈ పాన్ ఇండియా చిత్రానికి ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..? `మేరి జాన్`. అవును, ఈ ప్రేమ కథా చిత్రానికి మొదట మేరి జాన్ అనుకున్నారట.
Radhe Shyam:
అలాగే సినిమా పోస్టర్స్లో మేరి అనే పదం చిన్నగా.. జాన్ అనే పదం పెద్దగా ఉండేలా ప్లాన్ చేశారట. కానీ, ఇంతలోనే శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో తమిళ సూపర్ హిట్ `96` చిత్రానికి రీమేక్గా `జాను` వచ్చింది. దీంతో జానుకు తమ టైటిల్ దగ్గరగా ఉందనే కారణంతో మేకర్స్ మేరి జాన్ను కాస్త రాధేశ్యామ్గా మార్చారు.
కాగా, భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ప్రభాస్ విక్రమాదిత్యగా, పూజా హెగ్డే ప్రేరణగా నటించారు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులలో రాధేశ్యామ్పై భారీ అంచనాలను పెంచేశాయి.