Ram Charan: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆచార్య`. ఇందులో చిరు తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `సిద్ధ` అనే కీలక పాత్రను పోషించారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఇందులో హీరోయిన్లుగా నటించగా.. సోనూసూద్ విలన్గా చేశారు. మణిశర్మ సంగీతం అందించారు.
ఈ మధ్యే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర టీమ్.. నిన్న సాయంత్రం ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. దర్శకధీరుడు రాజమౌళి స్పెషల్ గెస్ట్గా రాగా.. హైదరాబాదులోని యూసఫ్ గుడా పోలీస్ గ్రవుండ్స్ లో ఈ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన ఈ ఈవెంట్ చివర్లో హోస్ట్ గా వ్యవహరించిన సుమ.. చిరు, చరణ్, కొరటాల శివలను పలు ఫన్నీ ప్రశ్నలు వేసింది. వాటికి చాలా తెలివిగా వారు ముగ్గురు సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే సుమ.. `ఇంట్లో నాన్న, భార్య ఉపాసనల్లో ఎవరికి భయపడతారు..?` అని చరణ్ను ప్రశ్నించింది.
అందుకే ఆయన బదులిస్తూ.. `భయం కాదు గానీ..మా నాన్న.. అమ్మ ముందు జాగ్రత్తగా ఉంటారు. నేను కూడా అదే నేర్చుకుని ఉపాసన ముందు కాస్త జాగ్రత్తగా ఉంటా. ` అంటూ సమాధానం ఇచ్చారు. ఇంతలోనే చిరు మైక్ అందుకుని `నన్ను చూసి నేర్చుకున్నావ్.. సుఖపడతావ్, ఆడవాళ్లతో పెట్టుకోకూడదు` అని చెబుతూ నవ్వులు పూయించారు. మొత్తానికి వీరి సరదా సంభాషణ మాత్రం నెట్టింట వైరల్గా మారింది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!