టాలీవుడ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి కొద్ది విరామం తర్వాత తిరిగి సినిమాలు చేయడంతో తన అభిమానుల లో ఆనందం ఉరకలేస్తుంది. వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న మెగాస్టార్ ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటించనున్న విషయం తెలిసినదే.
అయితే తాజాగా తమిళంలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన వేదాలమ్ అనే సినిమా ప్రస్తుతం తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి గారికి సోదరి గా నటించే పాత్ర ఎంతో కీలకమైనది. ఆ పాత్రకు గాను మొదట్లో సాయి పల్లవిని, కీర్తి సురేష్ ను తీసుకోవాలనే ఆలోచనలో దర్శకులు ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన సినీ దర్శకుడు మెహర్ రమేష్ అండ్ టీం చిరంజీవి సోదరి పాత్రలో నటించేందుకు కీర్తి సురేష్ ఫైనల్ చేశారని సినీ వర్గాల సమాచారం. మహానటి సావిత్రి వంటి బయోపిక్ లో నటించిన కీర్తి సురేష్ తన నటన ద్వారా తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మహానటి చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు కూడా సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో కలిసి తొలిసారిగా వెండి తెరపై కనిపించనున్నారు.
మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆచార్య చిత్రీకరణ జరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ కారణంగా షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే తిరిగి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు అనే విషయం తెలియడం లేదు. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే, చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో రాబోతున్న తన కొత్త సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నట్లు సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!