డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” తెరకెక్కిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది. ఇటీవలే సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వ్యూస్ మరియు లైకులు పరంగా రికార్డులు కూడా సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. అదేమిటంటే గతంలో హీరో రవితేజతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ “అమ్మానాన్న ఓ తమిళమ్మాయి” అనే సినిమా చేయడం తెలిసిందే.
“లైగర్” కూడా అదే తరహా సినిమా అని చాలామంది ఇటీవల చెప్పుకొస్తున్నారు. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలో కూడా హీరో రవితేజ బాక్సింగ్ చేస్తాడు. తల్లి జయసుధ దగ్గర బతుకుతాడు. “లైగర్” లో కూడా విజయ్ దేవరకొండ ని బాక్సర్ గా చూపించడం తో పాటు తల్లి రమ్యకృష్ణ దగ్గర ఉంటున్నాడు. సో “లైగర్” కూడా అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమా లాంటిదని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై పూరి జగన్నాథ్ రియాక్ట్ అయ్యారు.
“అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి” తో “లైగర్” నీ పోల్చవద్దని స్పష్టం చేశారు. “లైగర్” పూర్తిగా కొత్త తరహా జోనర్ సినిమా అని చెప్పుకొచ్చారు. పాత సినిమాకి సంబంధించి ఎటువంటి విషయాలను తీసుకోలేదని పేర్కొన్నారు. ఇది ఎంఎంఏ నేపథ్యంలో వచ్చే ఓ క్రేజీ లవ్ స్టోరీ ఉన్న పక్కా కమర్షియల్ యాక్షన్ డ్రామా అని చెప్పుకొచ్చారు. దీంతో పూరి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆగస్టు 25వ తారీకు ప్రపంచవ్యాప్తంగా “లైగర్” విడుదల కానుంది.