Uppena movie : నీ కన్ను నీలి సముద్రం.. అనే సాంగ్ కొన్ని రోజులుగా యువత నోళ్లల్లో నానుతోంది. ఈ పాట వచ్చిన కొన్ని రోజుల్లోనే మంచి రెస్పన్స్ సంపాధించిందని చెప్పాలి. అయితే ఈ పాట విడుదలకు సిద్ధమైన ఉప్పెన చిత్రంలోనిది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నది మెగా ఫ్యామిలీకి చెందిన పంజా వైష్ణవ్ తేజ్. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ పతాకాలపై వస్తున్నా ఈ చిత్రపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమా రిలీజ్ కు ముందే మంచి హైప్ ను క్రియేట్ చేసిందని చెప్పాలి. దీనికి కారణం ఒకటి సుకుమార్ రైటింగ్స్ కావడం, ఇంకోటి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదించడం. ఈ సినిమాలోని పాటలకు దేవిశ్రీ మంచి మ్యూజిక్ ఇచ్చాడని చెప్పాలి. ఇందులోని ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట నేటికీ ట్రెండింగ్ లో దూసుకుపోతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య సినిమా స్టోరీపై దేవిశ్రీ స్పందించాడు.
ఈ ఉప్పెన కథకు దేవిశ్రీ ఫిదా అయిపోయాడట. దర్శకుడు బుచ్చిబాబు తన గురువు సుకుమార్ కు తగిన శిష్యుడని చెప్పుకొచ్చాడు. సుకుమార్ లాగే ఇతరులకు పూర్తి భిన్నంగా బుచ్చిబాబు ఆలోచిస్తాడని తెలిపాడు. ఈ ఉప్పెన కథ ఎంతో వైవిధ్యమైందని తెలిపాడు.అలాగే సుకుమార్ సినిమాలకోసం మ్యూజిక్ కంపోజ్ చేసిన ప్రతీ పాటకు బుచ్చిబాబు సందేశాలిచ్చేవాడని తెలిపాడు. బుచ్చిబాబు నుంచి అందుకున్న ప్రసంసలను ఎన్నటికి మర్చిపోలేనని దేవి తెలిపాడు. ఉప్పెన చిత్రంలోని పాటలకు ట్యూన్ పంపితే.. మీకు ఈ సినిమా ఎంతో భాగా అర్థమైందని చెప్పడం సంతోషాన్ని కలిగించిందని దేవిశ్రీ తెలిపాడు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!