Jaqueline Fernandez: 200 కోట్ల రూపాయలకు సంబంధించి ఈడి కస్టడీలో ఉన్న సురేష్ చంద్రశేఖరన్ నుండి భారీ స్థాయిలో గిఫ్ట్ లు బాలీవుడ్ టాప్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అందుకోవడంతో ఈడి చేతిలో అడ్డంగా బుక్కయింది. ప్రస్తుతానికి అభియోగాలు అన్న తరహాలో దానికి సంబంధించి 7 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లను… ఈడీ అటాచ్ చేసింది. ఏడు కోట్ల రూపాయలను అక్రమ ఆదాయం గానే భావిస్తున్నట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది.
అంతమాత్రమే కాదు మరోసారి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నీ విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కస్టడీలో ఉన్న సుకేష్ చంద్రశేఖరన్.. కేసు రుజువైతే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఏడు కోట్ల రూపాయలు కోల్పోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి.. ఆ ఏడు కోట్ల రూపాయలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు ఖాతాల నుండి మరే ట్రాన్సాక్షన్ జరపకుండా…ఈడీ నిరోధించడం జరిగింది. సుకేశ్ నుండి బహుమతుల రూపంలో.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరియు ఆమె కుటుంబ సభ్యులకు మొత్తం ఏడు కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఖరీదైన కార్లు మరియు బ్యాగులు.. బహుమానాలు రూపంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి ఇచ్చినట్లు ఈ క్రమంలో కస్టడీలో ఉన్న సుకేష్… నేరం రుజువైతే జాక్వెలైన్ అకౌంట్ లో మొత్తం ఈడీ రికవరీ కింద స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మనీ ల్యాండరింగ్ కేసులో 2019లో జైలుకెళ్లిన రాన్ బాక్సి మాజీ యాజిమని శివిందర్ సింగ్ కుటుంబం నుండి బలవంతంగా చంద్రశేఖరన్ 200 కోట్ల రూపాయలు బలవంతంగా డబ్బులు వసూలు చేసినట్టు.. వాటిలో జాక్వెలైన్ కి దాదాపు ఐదు కోట్లకు పైగానే విలువైన బహుమతులు ఇచ్చారు అని ఈడి ఆరోపణ. ఈ క్రమంలో నేరం రుజువైతే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నుండి ఆ డబ్బులు స్వాధీనం చేసుకునే ఆకాశం ఉంది.