బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ కేస్ అనేక సంచలనాలకు కేంద్రం గా నిలుస్తుంది. ముఖ్యంగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పేరు తెరపైకి వచ్చిన నాటి నుండి… కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందు నుండి ఈ కేసులో సుశాంత్ తండ్రి కేకే సింగ్ రియా పై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తన కొడుకు దగ్గర నుండి రియా చక్రవర్తి 15 కోట్లు కొల్లగొట్టినట్లు అందువల్లే మోసపోయి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సుశాంత్ సూసైడ్ చేసుకుని చనిపోయినట్లు బీహార్ పోలీసుల దగ్గర తండ్రి ఫిర్యాదు చేయడం అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడి) ఎంటర్ కావడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈడి మనీ ల్యాండరింగ్ కేసులో రియా చక్రవర్తి కి నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 7వ తారీకు శుక్రవారం తమ ముందు హాజరుకావాలని అని ఈడీ అధికారులు సమాన్లు జారీ చేశారు. ఇంకా ఈ కేసులో ఇతర అనుమానితులకి కూడా త్వరలోనే ఈడి సమాన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.