అరవింద సమేతలో చిన్న పాత్రే చేసినా… సుబ్రహ్మణ్యపురంలో హీరోయిన్గా నటించింది. బ్రాండ్ బాబు సినిమాలో కూడా తనదైన నటనతో మెప్పించింది. అయితే ఈ అమ్మడుకి అవకాశాలు మాత్రం వెంటనే రావడం లేదో కాబోలు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో సందడి చేస్తుంది. ఈ ఏడాది ఓ కొత్త సినిమాను సైన్ చేసింది ఈషా రెబ్బా. వివరాల్లోకెళ్తే.. ఈమెను ప్రధాన పాత్రధారిగా చేసి ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి ఓ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ను తెరకెక్కించబోతున్నాడట. ఈ సినిమా కోసం ముందుగా క్యాథరిన్ను తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఆమె ఎందుకనో డ్రాప్ అయ్యింది. దీంతో క్యాథరిన్ స్థానంలో ఈషా రెబ్బాను ఓకే చేశారని.. త్వరలోనే సినిమా సెట్స్కు వెళుతుందని అంటున్నారు.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!