బాలీవుడ్ మొదలుకొని దక్షిణాది సినిమా రంగం వరకు ఎటువంటి పాత్ర ఇచ్చిన అవలీలగా రక్తి కట్టించే నటుడు ప్రకాష్ రాజ్. పాజిటివ్ పాత్ర అయినా నెగిటివ్ పాత్ర అయినా స్క్రీన్ మీద రెచ్చిపోతాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి సినిమా చూసే ప్రేక్షకులకు ఎంతో ఎంటర్టైన్ అందిస్తాడు. అటువంటి ప్రకాష్ రాజ్ ఇటీవల మహేష్ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు” 2020లో విడుదల కావటం తెలిసిందే.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మహేష్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. సినిమాలో మహేష్ బాబు తో పాటు విజయశాంతి కూడా నటించడం సంచలనం రేపింది. అటువంటి ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నెగటివ్ పాత్ర చేయడం జరిగింది. ఈ పాత్ర గురించి ఇటీవల ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ అయిష్టంగానే.. “సరిలేరు నీకెవ్వరు” లో విలన్ పాత్ర చేయాల్సి వచ్చింది అని స్పష్టం చేశారు. మహేష్ బాబు హీరోగా నటించిన ఆ సినిమాలో అబద్ధాలు ఆడే రాజకీయ నాయకుడిగా అఇష్టంగానే నటించాల్సి వచ్చింది.
ఇక అదే మహేష్ బాబు నిర్మాతగా “మేజర్” సినిమా లో చేసిన పాత్ర ఎంతో సంతృప్తినిచ్చిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ తెలియజేశారు. “మేజర్” లో హీరో అడవి శేష్ కి తండ్రిగా నటించడం జరిగింది. ఇంకా నా కెరియర్ లో బొమ్మరిల్లు, ఆకాశమంత సినిమాలలో చేసిన పాత్రలు కూడా ఎంతో సంతృప్తినిచ్చాయని పేర్కొన్నారు.