మహమ్మారి కరోనా వైరస్ ఎంట్రీ అవటంతో సినిమా షూటింగులు గత మార్చి నెల నుండి ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ప్రభుత్వాల నుంచి అనుమతులు రావడంతో మెల్ల మెల్లగా షూటింగ్ లు స్టార్ట్ అయ్యాయి. అయితే ఎన్ని నెలలు ఖాళీగా ఉండటంతో చాలా మంది హీరోయిన్లు చేతుల సినిమాలు లేకపోవడంతో…. సినిమా రంగంలో కాక సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డబ్బులు దండుకునట్లు వార్తలు సరికొత్తగా టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో వినబడుతున్నాయి.
చాలావరకు సినిమాలో హీరోయిన్ లకు ఇచ్చే పేమెంట్ తక్కువ. అదే విధంగా వారి పేరు మీద జరిగే బిజినెస్ కూడా తక్కువే. ఇవన్నీ ఒకానొకప్పుడు వినిపించిన మాటలు. కానీ ప్రస్తుత జనరేషన్ లో ఉన్న హీరోయిన్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని గ్రహించి క్రేజ్ ఉండగానే డబ్బులు దండుకుంటున్నారు. తెర మీదే కాకుండా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మల సంపాదన ఓ రేంజ్ లో సాగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మలు ఈమధ్య కమర్షియల్ పోస్టింగ్ లతో కాసులు దండుకుంటున్నారట. ఒక్కో కమర్షియల్ పోస్టింగ్ కు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారట. ఈ లిస్టు లో అందరి కంటే ముందు ఉన్న హీరోయిన్ అక్కినేని కోడలు సమంత.
సోషల్ మీడియాలో సమంత ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలు గురించి ఇంకా తన అభిప్రాయాలు గురించి సరదా సరదా ఫోజులతో ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటారు. దీంతో సమంత కి ఫాలోయింగ్ ఓ రేంజ్లో సోషల్ మీడియాలో ఉంది. సోషల్ మీడియాలో అన్ని అకౌంట్లకు కలిపి సమంతాకి కోటి 80 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే సమంత సోషల్ మీడియా పోస్టులకు మంచి డిమాండ్ ఉంది అంట. ఈ డిమాండ్ ని క్యాష్ చేసుకుంటున్న సమంత….ఒక్కో డిజిటల్ పోస్టుకు 20 లక్షల వరకు చార్జ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
సామ్ రేంజ్ కాకపోయినా మరో హాట్ బ్యూటీ పూజ డిజిటల్ ప్రమోషన్ పేరుతో గట్టిగానే వసూలు చేస్తున్నారు. ఈ జిగేల్ రాణికి ఆన్ లైన్ లో కోటీ 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాకుండా ఈ బ్యూటీ పోస్ట్ కు బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఉంటారు కాబట్టి పూజా హెగ్డే పేమెంట్ విషయంలో సమంతా కి దగ్గర లోనే ఉందట. పూజా హెగ్డే 15 లక్షలు ఒక పోస్ట్ కి ఛార్జ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అలాగే మిగతా హీరోయిన్లు కూడా ఈ విధంగానే సోషల్ మీడియాలో అడపాదడపా డబ్బులు సంపాదించుకుంటున్నారు అని ఇండస్ట్రీ వర్గాల వినబడుతున్న టాక్. ఏది ఏమైనా కెమెరా ముందు కాకపోయినా సోషల్ మీడియాలో పోస్టింగ్ లతో హీరోయిన్లు బాగా బిజినెస్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.