పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి కేవలం ఒక నెలరోజులు వర్క్ చేస్తే థియోటర్స్ కి తీసుకు వచ్చేయోచ్చు. ఇప్పటికే వకీల్ సాబ్ 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలోను సినిమా చేస్తున్నారు.
అయితే ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తున్నది ఎప్పుడెప్పుడు తమ సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వెళదామా అని. ఎట్టకేలకు రెండు నెలల తర్వాత ముఖ్యమంత్రి షూటింగ్స్ కి అనుమతి ఇచ్చారు. దీంతో పెండింగ్ లో ఉన్న సినిమాల షూటింగ్స్ ని కంప్లీట్ చేసుకునేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ షాకిచ్చినట్టు తెలుస్తుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఆగస్టు వరకూ సెట్స్ కి రాకూడదని నిర్ణయించుకున్నారట. దాంతో వకీల్ సాబ్ అలాగే క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఆగస్టు లాస్ట్ వీక్ నుండి షూట్ కి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది.. వకీల్ సాబ్ ని ఆగస్టు 15 రిలీజ్ చేద్దామనుకున్న దిల్ రాజు ప్లాన్స్ అన్ని మారిపోయినట్టే. ఇక క్రిష్ తో చేస్తోన్న సినిమా ఒక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సాగుతుందన్న టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకి ‘విరూపాక్ష’ అనే పేరును పరిశీలిస్తుండగా ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.
‘పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్, అలాగే క్రిష్ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ రెండు సినిమాలు పూర్తి చేసి హరీష శంకర్ దర్శకత్వం వహించే సినిమాలో జాయిన్ అవుతాడు. కంటిన్యూస్ గా షూటింగ్స్ జరిగితే గాని ఈ ప్రాజెక్ట్స్ అన్నీ 2021 ఆఖరికి కంప్లీటవుతాయి. ఇక పవన్ 2022లో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు. త్రివిక్రం శ్రీనివాస్ తో పాటు డాలీ దరకత్వంలో సినిమా చేయడానికి పవన్ సన్నాహాలలో ఉన్నట్టు తెలుస్తుంది.