ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం గుండెనొప్పి కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారని సోమవారం సోషల్మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఆ వార్తలను కుటుంబ సభ్యులు కొట్టపడేశారు. ఎందుకంటే ఆయన రెగ్యులర్గా గుండెకు సంబంధించిన చెకప్లు చేయించుకుంటున్నారని, అందులో భాగంగానే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారే తప్ప.. గుండెనొప్పితో కాదని వారు తెలియజేశారు. ప్రస్తుతం మణిరత్నం తమిళ నవల `పొన్నియన్ సెల్వన్`ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్, తారాగణంతో ఈ సినిమా రూపొందనుంది.
previous post
next post