GodFather: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “గాడ్ ఫాదర్” దసరా రోజు విడుదలయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో చిరంజీవి చరణ్ కలిసి నటించిన “ఆచార్య” అట్టర్ ప్లాప్ కావటం అభిమానులను ఎంతగానో నిరాశ కలిగించింది. ఈ క్రమంలో “గాడ్ ఫాదర్” సినిమాతో మెగా అభిమానులను కాలర్ ఎగరేసేలా స్క్రీన్ మీద వన్ మాన్ షో మాదిరిగా చిరంజీవి చేలరేగిపోయారు. దసరా నాడు విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ ట్రాక్ సొంతం చేసుకోవడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ముఖ్యంగా దర్శకుడు మోహన్ రాజా పనితీరు అద్భుతంగా ఉందని పొగుడుతున్నారు. విలన్ పాత్రలో సత్యదేవ్ .. అరాచకం సృష్టించారని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. మలయాళం “లూసిఫర్” సినిమాకి రీమేక్ గా వచ్చిన “గాడ్ ఫాదర్”.. అసలు పోలిక లేదని స్పష్టం చేస్తున్నారు. గాడ్ ఫాదర్ విజయంతో సినిమా యూనిట్ తో పాటు అభిమానులు ఫుల్ సంబరాలు చేసుకుంటున్న ఈ సమయంలో మోహన్ లాల్ అభిమానులు చిరంజీవిపై మండిపడుతున్నారు. విషయంలోకి వెళ్తే ఇటీవల “గాడ్ ఫాదర్” ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. తాను మలయాళం “లూసిఫర్” సినిమాపై పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదని చేసిన వ్యాఖ్యలపై మోహన్ లాల్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.
“లూసిఫర్” క్లాసిక్ కంటెంట్ కలిగిన సినిమా. ఇప్పట్లో ఈ సినిమాకి దగ్గర్లో మరో సినిమా రాలేదని .. చిరంజీవి చేసిన కామెంట్లు సరైనవి కావు. మరి అలాంటప్పుడు “లూసిఫర్” సినిమా రీమేక్ హక్కులు ఎందుకు కొన్నారు..? అంటూ మోహన్ లాల్ అభిమానులు మండిపడుతున్నారు. మరోపక్క ఫస్ట్ రోజే “గాడ్ ఫాదర్” ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో రావడంతో సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది.