Prabhas: బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా ప్రభాస్ పేరు డబల్ త్రిబుల్ గా మారుమ్రోగుతోంది. ఇండియాలో ఏ హీరోకి లేని మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి బాహుబలి తో క్రియేట్ అయ్యింది. దీంతో డార్లింగ్ తో సినిమా చేయాలని దేశంలో పలు ఇండస్ట్రీలకు చెందిన టాప్ డైరెక్టర్లు మరియు నిర్మాతలు క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే బాహుబలి తర్వాత తెరకెక్కించిన సాహో సినిమా కోసం దాదాపు ఏడాదిన్నర టైం తీసుకున్న ప్రభాస్… ఆ తర్వాత రాధేశ్యాం కోసం చాలా టైం కేటాయించారు. మధ్యలో కరోనా రావడంతో మరింత టైం వేస్ట్ అయ్యింది.
ఇటువంటి పరిస్థితులలో ప్రభాస్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” సినిమా చేయగా ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో..”ఆది పురుష్” మూవీ చేయడం జరిగింది. అయితే ఈ మూడు సినిమాలు ఈ ఏడాది ఇది ఫస్టాఫ్ లోనే రిలీజ్ చేయాలని ప్రభాస్ ఆలోచన చేస్తున్నారట. “రాధేశ్యాం” మార్చి నెలలో వస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత “సలార్” వేసవిలో వస్తున్నట్లు ఇంకా జూన్ మాసంలో “ఆది పురుష్” విడుదల చేయాలని ప్రభాస్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ వార్త విని ప్రభాస్ అభిమానులు అంత రిస్క్ చేయొద్దు అన్నా. మీకు దండం పెడతాం దేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. కనీసం ఒక సినిమాకి మూడు నెలలు గ్యాప్ తీసుకుంటే మంచిది అని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారట. ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల కూడా… సినిమా రిజల్ట్ ఎలా తేడా పడితే మార్కెట్ కి చిల్లు పడే అవకాశం ఉందని అభిమానులు.. ఒక సినిమా విడుదలకి మరో సినిమా విడుదలకి మూడు నెలలు గ్యాప్ ఉంటే బాగుంటుందని.. ఈ ఏడాదిలోనే మూడు సినిమాలు విడుదల చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు.