అభిమానానికి కూడా హద్దులుండాలి. ఆ హద్దులు దాటినప్పుడు గొడవలు రావడం ఖాయం. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోలైన అజిత్, విజయ్ ఫ్యాన్స్ గొడవ తారాస్థాయిలో ఉంది. మొన్నటి వరకు సోషల్ మీడియాకే పరిమితమైన ఈ గొడవ ఇప్పుడు దాడులు వరకు వెళ్లాయి. వివరాల్లోకెళ్తే.. కావంగరైలోని శ్రీలంక శరణార్థుల శిబిరంలో ఉమాశంకర్ అనే అజిత్ అభిమానిపై రోషన్ అనే విజయ్ అభిమాని దాడి చేశాడు. మిత్రులైన వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో అజిత్, విజయ్ ప్రస్తావన వచ్చింది. మాటా మాట పెరగడంతో గొడవ జరిగిందని సమాచారం. రోషన్, ఉమాశంకర్పై కత్తితో దాడి చేయడంతో ఉమాశంకర్కు తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికులు ఉమాశంకర్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. పోలీసులు రోషన్ను అరెస్ట్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
previous post
next post